న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో భాగంగా హమిల్టన్ వేదికగా ముగిసిన రెండో వన్డేల భారత తుది జట్టు కూర్పుపై మరోసారి విమర్శలు చెలరేగాయి. తొలి వన్డేలో ఫర్వాలేదనిపించిన సంజూ శాంసన్ ను పక్కనబెట్టడం, పదే పదే విఫలమవుతున్నా రిషభ్ పంత్ ను కొనసాగించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.