బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా లు పదవీకాలం పొడగించేందుకు యత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు బీసీసీఐ బాసులు రాజ్యాంగాన్ని మార్చాలని కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 2019 లో బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాలు తమ పదవులు చేపట్టారు. వీరి పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ తో ముగియాల్సి ఉంది. అయితే కొత్త పాలకవర్గం ఎంపికయ్యే వరకు తమకు కూలింగ్ పీరియడ్ ను పొడిగించాలని కోరుతూ దాదా అండ్ కో కోర్టు మెట్లెక్కింది.