ఐపీఎల్ 2021 వాయిదా వల్ల బీసీసీఐకి ఎన్ని కోట్ల నష్టం వచ్చిందంటే... కరోనా కారణంగా...

First Published May 6, 2021, 3:22 PM IST

అనేక అవాంతరాల మధ్య ఐపీఎల్ 2020 సీజన్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించి, వేల కోట్ల ఆదాయాన్ని గడించింది భారత క్రికెట్ బోర్డు. అయితే ఈ సారి మాత్రం కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్‌ 14వ సీజన్‌కి మధ్యలోనే బ్రేక్‌లు పడ్డాయి.

ఐపీఎల్ 2021 సీజన్ నిర్వహణ కోసం ఆరు నగరాల్లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిన బీసీసీఐ, అహ్మదాబాద్‌తో పాటు మిగిలిన ఐదు నగరాల్లో ఆటగాళ్ల వసతి, బస, బయో బబుల్ ఏర్పాట్ల కోసం భారీగా ఖర్చు చేసింది...
undefined
అలాగే కరోనా ప్రోటోకాల్ ప్రకారం ప్రతీ మ్యాచ్ నిర్వహణకి భారీగా ఖర్చులు చేసింది. సడెన్‌గా లీగ్‌కి బ్రేకులు పడడంతో భారత క్రికెట్ బోర్డుకు దాదాపు రూ.2 వేల కోట్ల నష్టం వచ్చినట్టు సమాచారం...
undefined
లీగ్ మధ్యలో ఆగిపోవడంతో బ్రాడ్‌క్రాస్టింగ్ ద్వారా వచ్చే ఆదాయం సగానికి పడిపోయింది. అలాగే స్పాన్సర్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా భారీగా తగ్గిపోనుంది...
undefined
24 రోజుల పాటు మ్యాచులు నిర్వహించిన బీసీసీఐ, మధ్యలోనే లీగ్‌ను నిలిపివేసింది. అయితే పూర్తి సీజన్ అందుబాటులో ఉండేందుకు సిద్ధపడి ఆటగాళ్లు ఇక్కడికి వచ్చారు. దాంతో ప్లేయర్లకు మాత్రం సీజన్ పూర్తి మొత్తాన్ని వేతనంగా చెల్లించాల్సి ఉంటుంది.
undefined
అంటే రాజస్థాన్ రాయల్స్ తరుపున కనీసం 14 మ్యాచులు ఆడి రూ.16 కోట్ల 25 లక్షలు తీసుకోవాల్సిన క్రిస్ మోరిస్... కేవలం 7 మ్యాచులు ఆడి ఈ మొత్తాన్ని అందుకోబోతున్నారు. ఈ విధంగా ఫ్రాంఛైజీలకు భారీగా నష్టం వాటిల్లనుంది...
undefined
అదీకాకుండా మధ్యలోనే సీజన్‌కి బ్రేకులు పడడం వల్ల తిరిగి ప్రారంభించేటప్పుడు మళ్లీ బయో బబుల్ ఏర్పాట్లు, ఆటగాళ్ల వసతి ఏర్పాట్లు ఇలా ఖర్చు విపరీతంగా పెరిగిపోనుంది. మొత్తంగా కరోనా కారణంగా ఐపీఎల్‌కి రూ.2200 కోట్లు నష్టం జరిగిందట.
undefined
కరోనా కారణంగా ఐపీఎల్ 2020 సీజన్‌ను యూఏఈలో నిర్వహించింది బీసీసీఐ. అక్కడ నిర్వహణ ఖర్చు తక్కువ కావడం, లాక్‌డౌన్ కారణంగా రికార్డు లెవెల్లో వ్యూయర్‌షిప్ రావడంతో బీసీసీఐకి దాదాపు రూ.200 కోట్ల లాభం వచ్చింది...
undefined
టైటిల్ స్పాన్సర్‌షిప్ వివో నుంచి అసోసియేట్ స్పాన్సర్లు, బ్రాడ్ కాస్టింగ్ స్టార్ స్పోర్ట్స్ ఛానెల్... ఇలా వివిధ విభాగాల నుంచి వచ్చే ఆదాయంలో సగం మాత్రమే బీసీసీఐకి దక్కనుంది.
undefined
నిజానికి ఐపీఎల్ 2020 సీజన్ కోసం ‘రెస్ట్రాటా’ కంపెనీకి బయో బబుల్ కాంట్రాక్ట్ ఇచ్చింది బీసీసీఐ. కట్టుదిట్టంగా బయో సెక్యూలర్ జోన్ ఏర్పాటు చేసి ఆటగాళ్ల కదలికలపై అనుక్షణం నిఘా పెట్టింది ఈ కంపెనీ...
undefined
అయితే ఈ కంపెనీకి భారీగా చెల్లించేందుకు ఇష్టపడని బీసీసీఐ, సొంతంగా బయో సెక్యూలర్ జోన్ ఏర్పాటుచేయాలని ప్రయత్నించింది. అయితే ఆటగాళ్ల కదిలకలపై నిఘా పెట్టే ట్రాకర్లు పనిచేయడం లేదని గ్రహించేసరికి చాలా ఆలస్యం జరిగింది.
undefined
మొత్తంగా ఐపీఎల్ 2021 సీజన్ కోసం కొన్ని కోట్లు ఎక్కువ ఖర్చు అవుతుందని ఆలోచించిన బీసీసీఐకి కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారీగా గండి పడింది. ఇప్పుడు ఐపీఎల్ 2021 సీజన్ మిగిలిన లీగ్‌ను నిర్వహించేందుకు సరైన సమయం దొరకడం కష్టం. ఆ సమయంలో మిగిలిన దేశాల ప్లేయర్లు ఖాళీగా ఉండడం మరీ కష్టం.
undefined
click me!