ఈ ఏడాది మేలో పురుషుల ఐపీఎల్ మీడియా హక్కుల విషయంలో బీసీసీఐ భారీగా ఆర్జించిన విషయం తెలిసిందే. వచ్చే ఐదేండ్ల కాలానికి గాను ఏకంగా రూ. 48,390.5 కోట్ల ఆదాయం పొందింది బీసీసీఐ. దీనిలో రూ. 23,575 కోట్లు టీవీ రైట్స్ వి కాగా రూ. 20,500 కోట్లు డిజిటల్ హక్కులకు దక్కాయి. ఇక రూ. 3,257 కోట్లు నాన్ ఎగ్జిక్యూటివ్ మార్క్యూ మ్యాచ్ లకు, రూ. 1,058 కోట్లు విదేశాలలో ఐపీఎల్ హక్కుల ద్వారా ఆర్జించింది.