ఇదిలాఉండగా.. అన్నీ కుదిరితే ఫిబ్రవరి 7, 8 న ఐపీఎల్ వేలాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐకి తెలిపాడు. ‘కరోనా తీవ్రత పెరిగితే తప్ప.. ఐపీఎల్ మెగా వేలం భారత్ లోనే ఉండే అవకాశముంది. ఈ మేరకు బెంగళూరులో ఏర్పాట్లు జరుగుతున్నాయి..’ అని కూడా వివరించిన సంగతి తెలిసిందే.