కాగా.. తదనంతర పరిస్థితులలో వన్డే కెప్టెన్సీ కూడా కోల్పోయిన కోహ్లి.. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. గంగూలీ గానీ, బీసీసీఐ కి సంబంధించి ఏ ఒక్క ప్రతినిధి గానీ తాను టీ20 నుంచి వైదొలిగినప్పుడు తనతో మాట్లాడలేదని వ్యాఖ్యానించాడు. గంగూలీ అలా ఎందుకు చెప్పాడో తనకు తెలియదని, ఈ విషయంలో ఆయననే స్పష్టత కోరాలని కోహ్లి మీడియాతో అన్నాడు.