Team India
2024-25 సంవత్సరానికి ఏ ఆటగాడు ఏ గ్రేడ్ లో :
A+ గ్రేడ్ : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా
A గ్రేడ్ : మహ్మద్ సిరాజ్, కెఎల్ రాహుల్, శుబ్మన్ గిల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ
B గ్రేడ్ : సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్
C గ్రేడ్ : రింకు సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఈషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా
A+ గ్రేడ్ లో ఎలాంటి మార్పులు లేవు... రూ.7 కోట్ల వార్షిక కాంట్రాక్ట్ గల ఈ గ్రేడ్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా కొనసాగుతున్నారు. ఈ కేటగిరీ అన్ని ఫార్మాట్లలో ఆడే కీలక ఆటగాళ్లకు ప్రత్యేకం.
కారు ప్రమాదం నుండి పూర్తిగా కోలుకుని టీమిండియా లో చేరిన పంత్ గతంలో B గ్రేడ్ లో ఉంటే ప్రస్తుతం A గ్రేడ్ (రూ.5 కోట్లు) లో చేరాడు. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో పంత్ వచ్చాడు. బిసిసిఐ నలుగురు కొత్త ఆటగాళ్లకు C గ్రేడ్ కాంట్రాక్ట్స్ ఇచ్చింది... వీరిలో మన తెలుగబ్బాయి నితీష్ కుమార్ రెడ్డితో పాటు హర్షిత్ రానా, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.