రోహిత్ శర్మ-సూర్య కుమార్ యాదవ్ చెన్నై బౌలింగ్ ను దంచికొట్టారు
చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ తొలి వికెట్కు 63 పరుగులు జోడించడంతో అద్భుతమైన ఆరంభం లభించింది. రికెల్టన్ 24 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత రోహిత్, సూర్యకుమార్ యాదవ్ జోడీ సీఎస్కేకు ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వలేదు.
మరో 26 బంతులు మిగిలి ఉండగానే ముంబైకి విజయాన్ని అందించారు. రోహిత్ 45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 76 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ టాప్ గేర్లో బ్యాటింగ్ చేసి కేవలం 30 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్తో 68 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు.