ఆసియా కప్ ముగిశాక స్వదేశంలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో కూడా భారత్ మ్యాచ్ లు ఆడనుంది. అవి ముగిశాక అక్టోబర్ లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టాపార్డర్ బ్యాటర్ గా రాహుల్, ఆల్ రౌండర్ గా దీపక్ చాహర్ లు జట్టుకు ఎంతో కీలకం కానున్నారు. దీంతో వారి ఫిట్నెస్ మీద ప్రత్యేక దృష్టి సారించాలని బీసీసీఐ లక్ష్మణ్ ను కోరింది.