టీ20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా భారత్ కు ఇదే పెద్ద ఈవెంట్. దీని తర్వాత స్వదేశంలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో సిరీస్ లు ఉన్నా అవి ద్వైపాక్షిక సిరీస్ లు. కానీ ఆసియా కప్ లో దాయాది పాకిస్తాన్ తో పాటు ఆరు దేశాలు పాల్గొంటున్నాయి. దీంతో ప్రపంచాన్ని గెలవడానికంటే ముందే ఆసియాను గెలవాలని ఇప్పటికే టీమిండియా కృత నిశ్చయంతో ఉంది.