ఆరు దేశాలు పాల్గొనబోయే ఈ టోర్నీలో ఆటగాళ్లకు హోటల్ వసతులు, స్టేడియంలో సౌకర్యాల కల్పన, ఇతరత్రా ఖర్చు తడిసిమోపడవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లంక లో ఒక్క పూట తిండి దొరకడానికే నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ నిర్వహించి అపకీర్తి మూటగట్టుకోవడం కంటే తప్పుకోవడమే ఉత్తమమన్న నిర్ణయానికి ఎస్ఎల్సీ వచ్చినట్టు తెలుస్తున్నది.