ఇదిలాఉండగా తాజాగా ఈ వివాదంపై టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా స్పందించాడు. ఆసియా కప్ లో ఆడకున్నా భారత్ కు వచ్చే నష్టమేమీ లేదని.. అలాగే పాకిస్తాన్ వన్డే ప్రపంచకప్ ఆడకున్నా తమకు ఒక్క శాతం నష్టం లేదని ఆ జట్టు మాజీ ఆటగాళ్లకు కౌంటర్ ఇచ్చాడు. అసలు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ను పోషిస్తున్నదే బీసీసీఐ అని చెప్పాడు.