దుబాయ్ పోలీసులు మ్యాచ్ సందర్భంగా ప్రత్యేక సూచనలు జారీ చేశారు. అభిమానులు ముందుగానే స్టేడియానికి రావాలని, నిబంధనలు పాటించాలని ఆదేశించారు. నిషేధిత వస్తువులు తీసుకువస్తే జరిమానాలు లేదా జైలు శిక్షలు విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.
కాగా, భారత్ ఈ టోర్నీ తొలి మ్యాచ్ లో యూఏఈపై ఘన విజయం సాధించింది. అక్షర్ పటేల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్తో ప్రత్యర్థి కేవలం 57 పరుగులకే కుప్పకూలింది. గిల్, అభిషేక్ శర్మల ఆగ్రెసివ్ బ్యాటింగ్తో భారత్ 4.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.
ఇక పాకిస్థాన్ తమ మొదటి మ్యాచ్లో ఓమన్ను 93 పరుగుల తేడాతో ఓడించింది. హారిస్ హాఫ్ సెంచరీ బాదగా, బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో విజయాన్ని నమోదు చేసింది.
భారత్-పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు 19 సార్లు తలపడ్డాయి. వీటిలో భారత్ 10 విజయాలు సాధించగా, పాకిస్థాన్ 6 మ్యాచ్లు గెలిచింది. మూడు మ్యాచ్లు ఫలితం లేకుండా ముగిశాయి.