టీ20 ప్రపంచకప్ ముగిశాక భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ సిరీస్ కు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, అశ్విన్ లకు విశ్రాంతి లభించింది. సీనియర్ ఆటగాళ్లతో పాటు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు కూడా విరామమిచ్చిన బీసీసీఐ.. ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ను తాత్కాలిక కోచ్ గా నియమించింది.