బిన్నీ చెప్పినట్టు గత కొంతకాలంగా భారత జట్టును గాయాల బెడద వేధిస్తున్నది. ఒకరు కాకుంటే మరొకరు అన్నట్టుగా టీమిండియా ప్లేయర్లు వరుసగా గాయాలపాలవుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ మొదలుకుని సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్, దీపక్ చాహర్, బుమ్రా, షమీ తదితర ఆటగాళ్లంతా కీలక సిరీస్ లకు ముందు గాయాలపాలవుతున్నారు.