గతేడాది ముగిసిన ఐపీఎల్ లో అదరగొట్టి.. సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కిన రుతురాజ్.. తర్వాత జరిగిన విజయ్ హజారే ట్రోపీలో కూడా ఇరగదీశాడు. దీంతో అతడికి టీమిండియాలో చోటు దక్కింది. కానీ తుది జట్టులో మాత్రం ఆడే అవకాశం రావడం లేదు. లంకతో మిగిలిన మ్యాచులకు అతడికి అవకాశమిస్తారని ఆశించినా.. అతడు గాయంతో ఏకంగా సిరీస్ నుంచే వైదొలగడం గమనార్హం.