ఈ ఏడాది జరిగిన ఐపీఎల్-14 సీజన్ లో విఫలమయ్యాడని ఆరోపిస్తూ డేవిడ్ వార్నర్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం పక్కనబెట్టిన విషయం తెలిసిందే. ఐపీఎల్-14 తొలిదశలో అతడిని జట్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన యాజమాన్యం.. ఆ తర్వాత రెండో దశలో ఏకంగా అతడిని జట్టులోంచి కూడా పక్కనబెట్టడం తెలిసిందే. అయితే ఐపీఎల్ అనంతరం జరిగిన టీ20 ప్రపంచకప్ లో ఆడిన వార్నర్.. ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా సాధించాడు.