విరాట్ కోహ్లీ లేకుండా భారత జట్టు ఎలా ఆడుతుందో అనుమానాలను పటాపంచలు చేశాడు భారత తాత్కాలిక సారథి అజింకా రహానే. మొదటి ఇన్నింగ్స్లో బౌలర్లను మార్చడంలో, ఫీల్డింగ్ సెట్ చేయడంలో తన కెప్టెన్సీ స్కిల్స్తో అందర్నీ ఆశ్చర్యపరిచిన రహానే... బ్యాటింగ్లో అద్భుత సెంచరీతో చెలరేగి బ్యాటుతోనూ సత్తా చాటాడు. అనుకోకుండా రనౌట్ అయిన అజింకా రహానే, రవీంద్ర జడేజాతో ప్రవర్తించిన తీరు అందర్నీ ఫిదా చేసి పడేసింది.