ఈసారి ఎంపికైన వెస్ట్ జోన్ జట్టులో యువతకే ప్రాధాన్యం ఇచ్చారు. జట్టులో యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు.
జట్టులో రవీంద్ర జడేజా లేకపోవడం గమనార్హం. ఇటీవల ఐదు టెస్టుల్లోనూ ఆడుతున్న క్రమంలో అతనికి విశ్రాంతి ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలిపారు. అయితే, ధర్మేంద్ర జడేజా, తుషార్ దేశ్పాండే, షంస్ ములానీ, హార్విక్ దేశాయ్, అర్జన్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చారు.
దులీప్ ట్రోఫీ 2025 వెస్ట్ జోన్ జట్టు
కెప్టెన్: షార్దూల్ ఠాకూర్ (ముంబై)
బ్యాట్స్మెన్: యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, రుతురాజ్ గైక్వాడ్
ఆల్రౌండర్స్: ములానీ, తనుష్ కొటియన్
బౌలర్లు: తుషార్ దేశ్పాండే, అర్జన్, ధర్మేంద్ర జడేజా
వికెట్ కీపర్లు: హార్విక్ దేశాయ్, సౌరభ్ నవలే
ఇతరులు: ఆర్య దేశాయ్, జయ్ ముత్ పటేల్
ప్రస్తుతం యంగ్ ప్లేయర్లతో పోటీ క్రమంలో పుజారా, రహానేలు తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. దాదాపు పదేళ్లుగా భారత టెస్టులకు బలంగా ఉన్న ఈ ఇద్దరికి, ఇప్పుడు ప్రాధాన్యత తగ్గిపోవడం జాతీయ స్థాయిలో వారి ప్రస్థానానికి చివరి పేజీ కావచ్చనే చర్చ మొదలైంది.