తర్వాత లక్ష్య ఛేదనలో భారత్.. 31 పరుగులకే రోహిత్, రిషభ్, కోహ్లీ వికెట్లు కోల్పోయింది. కానీ సూర్య మాత్రం.. వీరవిహారం చేశాడు. 55 బంతుల్లోనే 14 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేశాడు. సూర్య పోరాటంతో ఆ మ్యాచ్ లో భారత్.. విజయానికి దగ్గరగా వచ్చింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. సూర్య మరో ఓవర్ ఉండి ఉంటే మ్యాచ్ భారత్ గెలిచేదే.