భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. రెండు దేశాల ప్రజల జీవితాలలో క్రికెట్ కూడా ఓ భాగమైంది. ఇరు దేశాల్లో క్రికెటర్లకు ప్రత్యేక ఆదరణ ఉంది. సచిన్, ధోని, కోహ్లీని భారత్ లో ఆరాదిస్తే ఇమ్రాన్, వసీమ్ అక్రమ్, బాబర్ ఆజమ్ లు పాక్ లో అదే అభిమానం పొందుతున్నారు.