ఈ టోర్నీలో రాహుల్ దారుణంగా విఫలమవుతున్నాడు. గత మూడు మ్యాచ్ లలో 4, 9, 9 పరుగులు మాత్రమే చేశాడు. రాహుల్ వరుస వైఫల్యాలతో అతడిని ఇకనైనా పక్కనబెట్టాలని.. రిషభ్ పంత్ ను జట్టులోకి తీసుకుని రోహిత్ శర్మతో అతడిని ఓపెనింగ్ చేయించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో టీమ్ మేనేజ్మెంట్ ఏం చేయనుందననేదానిపై ఆసక్తి నెలకొంది.