Ms Dhoni: మ‌రో మూడు ఐపీఎల్ సీజన్లు.. ధోని పై క్రేజీ కామెంట్స్ !

First Published Nov 30, 2023, 3:37 PM IST

AB de Villiers: దక్షిణాఫ్రికా మాజీ క్రికెట‌ర్, మిస్ట‌ర్ 360 ఏబీ డివిలియర్స్.. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్షన్ లిస్ట్‌లో లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోని పేరును చూసిన త‌ర్వాత చాలా ఆనందం క‌లిగింద‌ని పేర్కొన్నాడు.
 

IPL 2024: ఐపీఎల్ 2024కు ముందు ఎంఎస్ ధోనీని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) రిటైన్ చేసుకుందనే వార్త తెలియగానే క్రికెట్ ప్రపంచం ఉత్సాహభరితంగా ఉంది. ఈ నిర్ణయం రాబోయే సీజన్ లో అతని ఉనికిని కాపాడుకోవడమే కాకుండా లీగ్ లో లెజెండరీ కెప్టెన్ ఫ్యూచ‌ర్ గురించి స‌రికొత్త చర్చలను రేకెత్తిస్తుంది. 
 

ఎంఎస్ ధోనీని రిటైన్ చేయడం ద్వారా డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ధోని నాయకత్వం, క్రికెట్ నైపుణ్యంపై తమకు నమ్మకం ఉందనే సంకేతాల‌ను చెన్నై సూప‌ర్ కింగ్స్ యాజ‌మాన్యం సంకేతాలు ఇచ్చింది. ఈ వ్యూహాత్మక నిర్ణయంతో ధోని కనీసం మరో సీజన్ పాటు ఐపీఎల్ వేదికగా రాణిస్తాడని, తన కెరీర్ లో మరో అధ్యాయాన్ని చేర్చుకుంటాడని చెప్ప‌డంలో సందేశం లేదు.
 

కెప్టెన్లుగా ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ చెరో ఐదు ఐపీఎల్ టైటిళ్లతో ఐపీఎల్ లీగ్ విజయాల్లో టాప్ లో ఉన్నారు. ధోనీని కొనసాగించడం శర్మతో సమానంగా ఉంచడంతో సీఎస్కే, ముంబై ఇండియన్స్ (ఎంఐ) మధ్య పోటీ మరింత తీవ్రంగా ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ రెండు ఫ్రాంచైజీలు కలిసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలుగా నిలిచాయి.
 

తాజాగా మిస్ట‌ర్ 360 ఏబీ డివిలియర్స్ ఐపీఎల్ లో ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై తన అభిప్రాయాలను పంచుకుంటూ క్రేజీ కామెంట్స్ చేశాడు. ధోనీ వయసు 42 ఏళ్లు, లీగ్ లో ఎక్కువ వ‌య‌స్సు ఆటగాళ్లలో ఒకడిగా ఉన్న క్రికెట‌ర్. డివిలియర్స్ రిటెన్షన్ జాబితాలో ధోనీ పేరును చూడటం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తన రిటైర్మెంట్ ప్రణాళికల గురించి ప్రతి ఒక్కరినీ ఊహించగల భారత మాజీ కెప్టెన్ సామర్థ్యం ప్రతి ఐపీఎల్ సీజన్ కు ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నాడు. 
 

ధోని ఓ స‌ర్‌ప్రైజ్‌ ప్యాకేజ్ అని పేర్కొన్నాడు. ధోని భవిష్యత్తు గురించి అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదంటూ ఏబీ డివిలియ‌ర్స్ వ్యాఖ్యానించాడు. ధ‌నాధ‌న్ సూప‌ర్ ఇన్నింగ్స్ కు మారుపేరైన డివిలియర్స్ ధోనీ భవితవ్యంపై కామెంట్స్ చేస్తూ.. ఎవ‌రికి తెలుసు ధోని ఇంకా మూడు ఐపీఎల్ సీజ‌న్లు ఆడ‌వ‌చ్చు అంటూ క్రేజీ కామెట్స్ చేశాడు. ధోనీ ఆట త‌న అభిమానులతో పాటు తోటి ఆటగాళ్లను ఆకట్టుకుంటూనే ఉందని పేర్కొన్నాడు. 
 

"రిటెన్షన్ లిస్ట్ లో ధోని పేరు ఉండటం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. గత సీజన్లో ఇదే అతడి చివరి సీజన్ అవుతుందా అనే దానిపై చాలా చర్చ జరిగింది. 2024లో మరో ఐపీఎల్ సీజన్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ధోని ఎప్పుడూ ఒక  స‌ర్‌ప్రైజ్‌ ప్యాకేజీనే" అని డివిలియ‌ర్స్ అన్నాడు. 
 

ఐపీఎల్ లోని ప‌లు జ‌ట్లు వ‌దులుకున్న ఆట‌గాళ్ల‌ను తీసుకుని మ్యాచ్ విన్నర్లుగా మార్చిన సీఎస్కే నైపుణ్యాన్ని ఏబీ డివిలియర్స్ ప్రశంసించాడు. దేశవాళీ క్రికెట్లో తమిళనాడుకు చెందిన ఆటగాడు షారుక్ ఖాన్ ను రాబోయే వేలంలో సీఎస్కే టార్గెట్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నాడు. 
 

మిస్ట‌ర్ 360 ఏబీ డివిలియ‌ర్స్ మిస్ట‌ర్ కూల్ మ‌హేంద్ర సింగ్ పై చేసిన ఈ క్రేజీ కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి. ధోని మ‌రో మూడు సీజ‌న్లు ఆడుతాడు అన‌గానే అత‌ని ఫ్యాన్స్ ఎగిరిగంతేస్తున్నారు. డివిలియ‌ర్స్ కామెంట్స్ నిజం కావాల‌ని కోరుకుంటున్నారు. చెన్నైలో ధోని ఉంటే ఆ మ‌జానే వేరని చెబుతున్నారు. 
 

click me!