ఐపీఎల్ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్ కు విశ్రాంతి తీసుకుని ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన కోహ్లీ.. ఎడ్జబాస్టన్ టెస్టులో 31 పరుగులే చేశాడు. ఆ తర్వాత రెండు టీ20లలో 12, రెండు వన్డేలలో 33 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వెస్టిండీస్ సిరీస్ కు కూడా అతడు అందుబాటులో లేడు. ప్రస్తుతం కోహ్లీ పారిస్ లో ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు.