ఐపీఎల్ సంచలనం మయాంక్ యాదవ్ అరంగేట్రం
ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. భారత్ సూపర్ బౌలింగ్ తో 127 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్ అయింది. అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తిలు మూడేసి వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్లు తలా ఒక్కో వికెట్ తీసుకున్నారు. స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది.
ఈ మ్యాచ్ లో ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్, ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అరంగేట్రం క్యాప్లు అందుకున్నారు. ప్రపంచ క్రికెట్లో విధ్వంసం సృష్టించేందుకు తుఫాను బౌలర్ లా తన అరంగేట్రంతో హెచ్చరికలు పంపాడు మయాంక్ యాదవ్. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ప్రకంపనలు సృష్టించిన మయాంక్.. ప్రపంచ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన వెంటనే తుఫాను సృష్టించాడు. ఐపీఎల్లో గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన ఈ బౌలర్.. గ్వాలియర్ టీ20 మ్యాచ్ లోనూ అదే జోరును చూపించాడు.