వాయిస్ ఆఫ్ బ్యాంకింగ్ వ్యవస్థాపకుడు, బ్యాంకింగ్ నిపుణుడు అశ్వనీ రాణా విశ్లేషణ ప్రకారం చిన్న విలువ గల నోట్లను ఎక్కువగా ATMలలో అందుబాటులో ఉంచడం ద్వారా రూ. 500 నోట్లను తగ్గించాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది నోట్ల ముద్రణ ఖర్చు తగ్గించడానికీ, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికీ తోడ్పడుతుంది.
అలాగే, కేంద్ర బ్యాంకు ఇప్పటికే ఈ-రూపీ రూపంలో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. నగదు వినియోగం తగ్గుతున్న నేపథ్యంలో, పెద్ద నోట్ల అవసరం తగ్గనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.