ఈ ఏడాది అంటే 2025 ఫిబ్రవరి నెలలో దాదాపు రూ.22 లక్షల కోట్ల విలువైన 1,611 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇదే పెద్ద రికార్డు అనుకుంటే మార్చి నెలలో మరో రూ.రెండు లక్షల కోట్లు ట్రాన్సాక్షన్స్ జరగడం అద్భుతమైన విషయం. ఈ లెక్కన మార్చి నెలలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ప్రకారం ఇప్పుడు రోజుకు సగటున 59 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయన్న మాట.
అంటే ప్రతి సెకనుకు 6,800 లావాదేవీలను యూపీఐ హ్యాండిల్ చేస్తోంది. ఈ లెక్కన రోజువారీ లావాదేవీల విలువ రూ.79,910 కోట్లు.