Income Tax Bill 2025: కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లును కేంద్రం ఎందుకు వెనక్కి తీసుకుంది?

Published : Aug 08, 2025, 04:48 PM IST

Income Tax Bill 2025: కొత్త ఆదాయపు పన్ను బిల్లును కేంద్రం ఉపసంహరించుకుంది. అన్ని మార్పులతో నవీకరించిన బిల్లును ఆగస్టు 11న మళ్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. పలు అంశాలకు సంబంధించి సెలెక్ట్ కమిటీ కీలక సిఫార్సులు చేసింది.

PREV
15
కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లును వెనక్కి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురావాలనుకున్న ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లును వెనక్కి తీసుకుంది. ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం తాజాగా వెనక్కి తీసుకుంది. 

అయితే ఇది తాత్కాలిక వెనుకడుగు మాత్రమేనని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అన్ని సవరణలతో, పలు మార్పులతో మరింత స్పష్టతతో కూడిన బిల్లును ఆగస్టు 11న తిరిగి పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

DID YOU KNOW ?
భారత ఆదాయపు పన్ను చట్టం 1961
భారత ఆదాయపు పన్ను చట్టం 1961లో ఆమోదించారు. ఇది 1962 ఏప్రిల్ 1న అమలులోకి వచ్చింది. పాత చట్టాన్ని భర్తీ చేసి, సులభతరంగా రూపొందించేందుకు 2025లో కొత్త బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది.
25
ప్రతిపక్షాల అభ్యంతరాలతో కమిటీకి పంపిన బిల్

బిల్లుపై విపక్షాల నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో, దీనిని బైజయంత్ పాండా నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీకి అప్పగించారు. ఈ కమిటీ 4500 పేజీల నివేదిక సమర్పిస్తూ, 285 కీలక సిఫార్సులను చేసింది. వాటిని పరిగణనలోకి తీసుకొని, కేంద్రం బిల్లులో మార్పులు చేస్తోంది.

35
సెలెక్ట్ కమిటీ సిఫార్సుతో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లులో ముఖ్యమైన మార్పులు

సెలెక్ట్ కమిటీ చేసిన సిఫార్సుల్లో గృహ రుణ వడ్డీలపై మినహాయింపులు, ఖాళీగా ఉన్న ఆస్తులపై ఆదాయ పన్ను లెక్కింపు, పింఛన్ మినహాయింపులు వంటి అంశాలపై స్పష్టత కల్పించడం ప్రధానంగా ఉన్నాయి.

అలాగే, వాణిజ్య ఆస్తులపై పన్నుల విధానం, గందరగోళంగా ఉన్న క్లాజ్‌లను సవరించాలని కమిటీ పేర్కొంది. కమిటీ సూచించిన విధంగా సాధారణ క్రమంలో అనే పదాన్ని తొలగించి వాస్తవ ఆదాయాన్ని మాత్రమే పరిగణించాలన్న ప్రతిపాదన ఉంది.

45
పాత చట్టానికి మార్పులు అవసరాన్ని స్పష్టం చేసిన ప్రభుత్వం

1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టం అనేక బడ్జెట్లలో మార్పులు చెందుతూ సంక్లిష్టంగా మారింది. పన్ను చెల్లింపుదారులకు అర్థం చేసుకోవడంలో క్లిష్టతలు ఏర్పడ్డాయి.

అందువల్ల 2024 బడ్జెట్‌లో కేంద్రం ఈ చట్టాన్ని సరళతరం చేస్తామని ప్రకటించింది. దీనితోనే కొత్త బిల్లుకు పునాది పడింది. ఈ క్రమంలోనే పార్లమెంట్ ముందుకు వచ్చిన బిల్లు మరోసారి మార్పులతో మళ్లీ చట్ట సభల ముందుకు రానుంది.

55
ఆగస్టు 11న మార్పులు చేసిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లు 2025 ప్రవేశం

విచారణలు, సూచనలు, లోపాల సవరణలతో కూడిన కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ బిల్లు 2025ను ఆగస్టు 11న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిలో 23 అధ్యాయాలు, 536 సెక్షన్లు, 16 షెడ్యూల్స్ ఉన్నాయి.

పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా ఉండేలా చిన్న మినహాయింపులు, స్పష్టమైన విధానాలతో రూపొందించారని సమాచారం. పాత బిల్లులోని ముసాయిదా లోపాలు, భాషా దోషాలను సవరించి, కొత్త పద్ధతులను సమర్పించేందుకు కేంద్రం సిద్ధమైంది.

ఈ కొత్త బిల్లుతో, పన్ను చెల్లింపు వ్యవస్థను మరింత సుస్పష్టం చేసి, డిజిటల్ ఆధారితంగా మానవ జోక్యం తగ్గించి, ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రజలకు దగ్గర చేయాలన్నది కేంద్ర లక్ష్యంగా ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories