వెండి ఢమాల్..
బంగారమే కాదు..వెండి, ప్లాటినం కూడా తగ్గుముఖం పట్టింది. 10 గ్రాముల ప్లాటినం ధర రూ.54,400గా ఉంది. మరోవైపు వెండి మార్కెట్ కూడా భారీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం కిలో వెండి ధరపై రూ.10వేలు తగ్గి రూ.2,70,000 చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బంగారం ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు వంటి అంశాల కారణంగా ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడైనా, బంగారం కొనాలనుకున్నా మార్కెట్లు గమనించి, వీలైతే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.