ఇప్పటికీ మీ వద్ద రూ.2000 నోట్లు వుంటే ఎలా మార్చుకోవచ్చంటే :
అక్టోబర్ 7, 2023 వరకు అన్ని బ్యాంకుల ద్వారా రూ.2000 నోట్లను మార్చుకునే అవకాశం కల్పించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అప్పటికీ ఎవరివద్ద అయినా నోట్లు మిగిలివుంటే ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకునే అవకాశం కల్పించాం. ఇప్పటికీ దేశంలోని 19 ఆర్బిఐ కార్యాలయాల్లో ఈ అవకాశం వుంది.
ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయాలు హైదరాబాద్ తో బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, ముంబై లో వున్నాయి. తెలుగువారిలో ఇంకా ఎవరివద్ద అయినా రూ.2000 నోట్లు వుంటే వీటిలో ఏది దగ్గరయితే అక్కడికి వెళ్లి మార్చుకోవచ్చు. ఇక అహ్మదాబాద్, బేలాపూర్,భోపాల్, భువనేశ్వర్,చండీఘడ్, గౌహతి, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్ కతతా,లక్నో, నాగపూర్,డిల్లీ, పాట్నాలలో కూడా ఆర్బిఐ కార్యాలయాలున్నాయి...అక్కడ కూడా మార్చుకోవచ్చు.