దేశంలోని నోట్లు నాలుగు కరెన్సీ ప్రెస్లలో ముద్రిస్తారు. అందులో రెండు నాసిక్ (పశ్చిమ భారతదేశం), దేవాస్ (మధ్య భారతదేశం) ప్రాంతాల్లో భారత ప్రభుత్వ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) ఆధ్వర్యంలో ఉన్నాయి.
మరో రెండు మైసూరు (దక్షిణ భారతదేశం), సాల్బోని (తూర్పు భారతదేశం) ప్రాంతాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL) ద్వారా నిర్వహణలో ఉన్నాయి.