ఆర్బీఐ తీసుకురాబోతున్న కొత్త నిబంధనలతో లోన్ తీసుకునే ప్రక్రియ పూర్తిగా మారనుంది. ఇప్పటిదాకా డిఫాల్ట్ అయ్యాకే చర్యలు తీసుకునే బ్యాంకులు, ఇకపై ముందే ప్రమాదాన్ని అంచనా వేయనున్నాయి.
బ్యాంకుల నుండి లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్న కోట్లాది మంది భారతీయులకు ఇది ముఖ్యమైన అప్డేట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకురాబోతున్న 'ఎక్స్పెక్టెడ్ క్రెడిట్ లాస్' (ECL) ఫ్రేమ్వర్క్, బ్యాంకులు లోన్లు ఇచ్చే పద్ధతినే మార్చేయనుంది. ఏప్రిల్ 1, 2027 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలు, ముఖ్యంగా తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారిపై నేరుగా ప్రభావం చూపొచ్చు.
25
బ్యాంక్ లోన్ రూల్స్ చేంజ్..
ప్రస్తుత పద్ధతిలో కస్టమర్ లోన్ వాయిదాలు కట్టడంలో సమస్య వచ్చిన తర్వాతే బ్యాంకులు రిస్క్ను అంచనా వేస్తున్నాయి. కానీ కొత్త ECL విధానం, భవిష్యత్తులో వచ్చే ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేయడానికి బ్యాంకులకు సహాయపడుతుంది. ఈఎంఐ ఆలస్యం కావడం, ఆదాయంలో స్థిరత్వం లేకపోవడం, క్రెడిట్ కార్డు ఎక్కువగా వాడటం వంటి అంశాలు మీ లోన్ అర్హతను నిర్ణయిస్తాయి.
35
730 లోపు సిబిల్ ఉంటే ఏం జరుగుతుంది?
బ్యాంకింగ్ రంగ నిపుణుల అంచనాల ప్రకారం… 730 కంటే తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవారికి లోన్ పొందడం ఒక సవాల్గా మారొచ్చు. వీరికి బ్యాంకులు అధిక వడ్డీ రేటు విధించడం, అదనపు డాక్యుమెంట్లు అడగటం, లేదా ఆస్తిని తనకా పెట్టమనడం వంటి షరతులు కోరవచ్చు. కొన్నిసార్లు లోన్ అప్లికేషన్లను నేరుగా తిరస్కరించే అవకాశం కూడా ఉంది.
730 కంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉన్న కస్టమర్లు అంటే ఆర్థిక క్రమశిక్షణ కలిగినవారు అని అర్థం… వీరిని అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఏ బ్యాంకులు వదులుకోవు. వారిని తమ కస్టమర్లుగా చేసుకునేందుకు బ్యాంకులు పోటీపడతాయి. వీరికి తక్కువ వడ్డీ రేట్లు, ప్రత్యేక ఆఫర్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు సులభంగా లభిస్తాయి.
55
ఇప్పుడేం చేయాలి..?
లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్న వాళ్లు, తమ సిబిల్ స్కోర్ను మంచిగా మెయిన్టెయిన్ చేయడం చాలా అవసరం. ఈఎంఐలను సరైన టైమ్కి కట్టడం, అనవసరమైన లోన్ అప్లికేషన్లు పెట్టకపోవడం, క్రెడిట్ కార్డ్ వాడకాన్ని అదుపులో ఉంచుకోవడం వంటివి మీ భవిష్యత్ లోన్ అవకాశాలను కాపాడతాయి. ఈ కొత్త రూల్స్ ఇంకా అమల్లోకి రాకపోయినా, ఇప్పటి నుంచే మంచి క్రెడిట్ అలవాట్లను అలవర్చుకోవడం తెలివైన పని.