20వ విడత విడుదల తేదీ ఎప్పుడు?
సాధారణంగా నాలుగు నెలలకోసారి పీఎం కిసాన్ యోజన పథకం డబ్బులు విడుదల చేస్తారు. 18వ విడత అక్టోబర్ 2024లో రైతుల ఖాతాల్లో వేశారు. 19వ విడత ఫిబ్రవరి 2025లో వచ్చింది. 20వ విడత జూన్ 2025లో వస్తుందని అధికారుల ద్వారా తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ లోపే ఆధార్-బ్యాంక్ లింకింగ్, భూమి ధ్రువీకరణ, e-KYC వంటివి పూర్తి చేసుకోవడం తప్పనిసరి.