Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి

Published : Aug 25, 2026, 01:43 PM IST

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని నగరాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గబోతున్నాయి... కాబట్టి ఇప్పుడే భారీగా కొనుగోలుచేసి నిల్వ చేసుకోవడం మంచిది. అసలు ఉల్లిపాయల ధరలు ఎందుకు తగ్గనున్నాయో తెలుసా?

PREV
15
ఉల్లిపాయల ధరలు త్వరలోనే తగ్గుతాయా?

కొన్ని రోజులుగా ఉల్లిపాయల ధరలు పెరుగుతున్నాయి... దీంతో సామాన్య ప్రజలు కంగారుపడిపోతున్నారు. గతంలో రూ.20-30 కి కిలో ఉల్లిపాయలు ఉంటే ఇప్పుడు రూ.60-70 కి పెరిగింది... ఇలా ఒకేసారి ధర డబుల్ అయ్యింది. ఇలా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా ప్రధాన మార్కెట్లలో ఉల్లి ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ధరలు ఎలా ఉంటాయో అన్న భయం కొనసాగుతోంది.

మార్కెట్‌కు వచ్చే సరుకు, ఉత్పత్తి, నిల్వ, రవాణా వంటి అనేక కారణాలు ఉల్లి ధరల పెరుగుదలకు కారణం అవుతాయి. నిర్దిష్ట కాలంలో మార్కెట్‌కు వచ్చే ఉల్లి సరఫరా తగ్గితే, డిమాండ్‌కు తగినంత సరుకు లేకపోవడంతో ధరలు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో హోల్‌సేల్ మార్కెట్‌లో ధరలు పెరగడం, చివరకు రిటైల్ ధరలపైనా ప్రభావం చూపుతుంది.

25
ఉల్లిపాాయల ట్రైన్ వచ్చేస్తోంది

అయితే ఉల్లిపాయల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మార్కెట్‌లో ఉల్లి సరఫరాను పెంచేందుకు, ప్రభుత్వం తన బఫర్ స్టాక్‌లో నిల్వ ఉంచిన ఉల్లిపాయలను వివిధ ప్రధాన నగరాలకు పంపడం ప్రారంభించింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న నిల్వల నుంచి ప్రత్యేక రైలు ద్వారా ఉల్లిని తరలిస్తున్నారు.

నాసిక్ ప్రాంతం నుంచి ఉల్లిపాయలను బస్తాల్లో నింపి, ప్రత్యేక రైలు బోగీలలో దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపుతున్నారు. 'కందా ఎక్స్‌ప్రెస్' అని పిలిచే ఈ ప్రత్యేక రైలు ద్వారా పెద్ద మొత్తంలో ఉల్లిని వేగంగా ప్రధాన మార్కెట్లకు చేరవేసేందుకు చర్యలు తీసుకున్నారు. రోడ్డు మార్గంలో కాకుండా, రైలు ద్వారా ఒకేసారి భారీ స్థాయిలో సరుకును వివిధ ప్రాంతాలకు పంపగలరు. దీంతో మార్కెట్లలో ఉల్లి లభ్యత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

35
ఉల్లి ధర ఇంత తగ్గుతుందా?

తెలుగువారి వంటిట్లో ఉల్లిపాయలు లేనిదే వంటలు చేయడం కుదరదు... అందుకే వీటి ధరల పెరుగుదల గృహిణులను బెంబేలెత్తిస్తోంది. వంటల్లో రోజూ వాడతాం కాబట్టి ఈ ధరల పెరుగుదల కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఫ్యామిలీ బడ్జెట్ కు ఉల్లి ఘాటు తగులుతోంది... ఈ క్రమంలో కేంద్రం ధరలు తగ్గించేందుకు చేపట్టిన చర్యలు ఊరట ఇవ్వనున్నాయి.

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని మార్కెట్లకు పెద్ద మొత్తంలో ఉల్లిపాయలు చేరితే, ప్రస్తుతం ఉన్న కొరత తగ్గి, సరఫరా మెరుగుపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ నిల్వల నుంచి మార్కెట్‌కు పంపే ఉల్లిని తక్కువ ధరకు విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీని ద్వారా కిలో ఉల్లి సుమారు రూ.30 నుంచి రూ.35 మధ్య లభించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత మార్కెట్ ధరలతో పోలిస్తే ఇది గణనీయమైన తగ్గుదల... కాబట్టి, ఉల్లి ధరల పెరుగుదలతో ఆందోళన చెందుతున్న ప్రజలకు ఈ చర్య కొంత ఉపశమనం కలిగిస్తుంది.

45
ధరలు తగ్గగానే ఉల్లి కొనేయండి

ఒక వస్తువు ధర పెరిగినప్పుడు దాని సరఫరాను పెంచడం ద్వారా ధరను నియంత్రించవచ్చు... ఇప్పుడు కేంద్రం ఇదే చేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ నిల్వల్లో ఉన్న ఉల్లిని పెద్ద మొత్తంలో మార్కెట్‌కు తీసుకువస్తే, వీటి లభ్యత పెరుగుతుంది. డిమాండ్ కంటే సరఫరా తక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరుగుతాయి. అదే సమయంలో సరఫరా పెరిగితే ధరల ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. అందువల్ల రైలు ద్వారా పెద్ద మొత్తంలో ఉల్లిని ప్రధాన మార్కెట్లకు పంపే చర్య రిటైల్ ధరలపైనా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

ఉల్లి ధరలు తగ్గిన వెంటనే ప్రజలు ఎక్కువ మోతాదులో కొనడానికి ఆసక్తి చూపడం సహజం. ముఖ్యంగా కుటుంబాలకు నిరంతరం అవసరమయ్యే వస్తువు కాబట్టి ధర గణనీయంగా తగ్గితే కొందరు అదనంగా కొని నిల్వ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. కానీ ఉల్లిపాయలను ఎక్కువ కాలం నిల్వ ఉంచితే కుళ్లిపోవడం, తేమ చేరడం, మొలకలు రావడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ధర తగ్గినా, అవసరానికి తగినంత మాత్రమే కొని సరైన పద్ధతిలో నిల్వ చేసుకోవడం మంచిది.

55
మార్కెట్ ను గమనించండి

ప్రస్తుత ధరల పెరుగుదలతో ఎక్కువగా నష్టపోయింది గృహిణులే. రోజువారీ వంటలో ఉల్లిపాయలు తప్పనిసరి వస్తువు కాబట్టి దాని ధర తగ్గితే నెలవారీ కిరాణా, కూరగాయల ఖర్చులో కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రభుత్వ నిల్వల నుంచి ఉల్లిపాయలు మార్కెట్‌కు రావడం, స్థానిక సరఫరా కూడా పెరిగితే ధరలు మరింత అదుపులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఉల్లి ధరలను తగ్గించేందుకు చర్యలు ప్రారంభమైన నేపథ్యంలో రాబోయే కొద్ది రోజుల్లో మార్కెట్ పరిస్థితిని గమనించడం చాలా అవసరం. రైలు ద్వారా వచ్చే ఉల్లిపాయలు మార్కెట్‌కు ఎంతవరకు చేరుతున్నాయి, హోల్‌సేల్ ధరలో ఎలాంటి మార్పు వస్తుంది, దాని ప్రభావం రిటైల్ మార్కెట్‌లో ఎలా ప్రతిఫలిస్తుంది అనేవే ధరల తగ్గుదల స్థాయిని నిర్ణయిస్తాయి. కాబట్టి "ఉల్లి ధరలు ఇక తగ్గుతాయా?" అనే ఎదురుచూపులో ఉన్న ప్రజలకు ప్రస్తుత ప్రభుత్వ చర్య ఒక శుభవార్తగా చెప్పవచ్చు. ధరల తగ్గుదల కొనసాగి, మార్కెట్‌లో సరఫరా సజావుగా ఉంటే వంటగదిలోని ఈ ముఖ్యమైన వస్తువును తక్కువ ధరకే కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories