Business Ideas: లక్షలు పెట్టి మ్యారేజ్ కాదు.. ఇది పెడితే ఏడాది పొడవునా హ్యపీసే.. హ్యపీస్.. ట్రెండింగ్ బిజినెస్

Published : Mar 31, 2026, 07:30 PM IST

Business Ideas: రూ. 3 లక్షల పెట్టుబడితో మినరల్ వాటర్ ప్లాంట్ బిజినెస్ ప్రారంభించి నెలకు రూ. 45,000 పైగా ఎలా సంపాదించవచ్చునని మీకు తెలుసా.? అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకోండి. 

PREV
15
పెట్టుబడి వివరాలు..

నేటి కాలంలో స్వచ్ఛమైన తాగునీటికి ఉన్న డిమాండ్ దృష్ట్యా మినరల్ వాటర్ ప్లాంట్ స్థాపించడం ఒక ఉత్తమ వ్యాపార అవకాశంగా మారింది. కేవలం రూ. 3 లక్షల పెట్టుబడితో ఈ బిజినెస్ ఎలా ప్రారంభించవచ్చు. ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి దాదాపు రూ. 3 నుంచి రూ. 4 లక్షల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. ఇందులో వాటర్ ప్యూరిఫైయర్ ప్లాంట్, బోర్, ఎక్విప్మెంట్ సెటప్, వాటర్ క్యాన్లు కొనుగోలు ఖర్చులు కలిసి ఉంటాయి.

25
నిర్వహణ ఖర్చులు

వ్యాపారం సజావుగా సాగాలంటే నెలకు దాదాపు రూ. 15,000 వరకు నిర్వహణ ఖర్చులు ఉంటాయి. ఇందులో విద్యుత్ బిల్లు, కార్మికుల కూలీ, డెలివరీ ఖర్చులు ఉంటాయి.

35
ఆదాయం, లాభాల విశ్లేషణ:

రోజువారీ ఆదాయం: రోజుకు సగటున 100 క్యాన్లను రూ. 20 చొప్పున విక్రయిస్తే రూ. 2000 ఆదాయం లభిస్తుంది.

నెలవారీ ఆదాయం: నెలకు 30 రోజుల లెక్కన చూస్తే రూ. 60,000 (2000 x 30) వరకు ఆదాయం ఉంటుంది.

నెలవారీ నికర లాభం: మొత్తం ఆదాయం రూ. 60,000 నుంచి రూ. 15,000 ఖర్చులు తీసివేస్తే, రూ. 45,000 నికర లాభం మిగులుతుంది.

45
వార్షిక లాభం

నెలకు రూ. 45,000 లాభం చొప్పున ఏడాదికి దాదాపు రూ. 5.40 లక్షల వరకు సంపాదించవచ్చు. ఒకవేళ మీరు మీ మార్కెటింగ్‌ను పెంచుకుని రోజుకు 200 క్యాన్లను సరఫరా చేయగలిగితే, సంవత్సరానికి రూ. 10 లక్షల వరకు లాభం ఆర్జించే అవకాశం ఉంటుంది.

55
భవిష్యత్తులో స్థిరమైన ఆదాయం

చిన్న చిన్న ఫంక్షన్లకు లక్షలు ఖర్చు చేసే బదులు, అదే మొత్తంతో ఇలాంటి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో స్థిరమైన ఆదాయం పొందవచ్చు. నాణ్యమైన నీటిని అందిస్తూ సరైన మార్కెటింగ్ చేసుకుంటే ఈ బిజినెస్‌లో తిరుగుండదు.

Read more Photos on
click me!

Recommended Stories