సెన్సెక్స్, నిఫ్టీతో పాటు చిన్న, మధ్య తరహా సూచీల్లో కూడా భారీ పతనం నమోదైంది. స్మాల్క్యాప్ సూచీ 2.6% పతనం కాగా, మిడ్క్యాప్ సూచీ 1.8% పతనమైంది.
ఇండిగో, బీఈఎల్, ట్రెంట్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ వంటి ప్రధాన షేర్లు గణనీయంగా క్షీణించాయి. ప్రపంచవ్యాప్తంగా యెన్ క్యారీ ట్రేడ్ తిరోగమనంపై ఉన్న భయాలు కూడా పెట్టుబడిదారుల్లో ఆందోళనలు పెంచాయి.
రోజంతా అమ్మకాల ఒత్తిడి, ఎఫ్ఐఐ అవుట్ఫ్లో, రూపాయి పతనం, యూఎస్ ఫెడ్ నిర్ణయంపై అనిశ్చితి.. ఇలా అన్ని అంశాలు కలిసి భారత స్టాక్ మార్కెట్లను ఒక్కరోజులోనే భారీగా కుదిపేశాయి. వచ్చే కొన్ని రోజులు మార్కెట్లలో అస్థిరత కొనసాగనుందని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.