హిమాలయాల గురించి సునీతా విలియమ్స్ ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతిసారి వాటిని దాటినపుడు ఫోటోలు తీసేవారమని ఆమె చెప్పారు. గుజరాత్, ముంబై వైపు వెళ్తున్నపుడు తీరం వెంబడి లైట్ హౌస్ లాగా పడవలు కనిపిస్తాయని ఆమె అన్నారు.
భారతదేశం దీపాల వలలా ఉంటుందని ఆమె అభివర్ణించారు. పెద్ద నగరాలు, చిన్న నగరాలు అంతరిక్షం నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తాయని అన్నారు.