Published : Sep 03, 2025, 11:56 PM ISTUpdated : Sep 04, 2025, 12:02 AM IST
GST Tax Rates: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. రోజువారీ వస్తువులు చౌకగా మారనున్నాయి. విలాస వస్తువులు, పొగాకు ఉత్పత్తులు మరింత ఖరీదు అవుతాయి. మొత్తంగా ధరలు పెరిగే, తగ్గే వస్తువులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
జీఎస్టీలో కొత్త మార్పులు వచ్చాయి. 2017లో ప్రారంభమైన వస్తు సేవల పన్ను (GST) లో ఇదే అతిపెద్ద మార్పు అని చెప్పొచ్చు. జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో పన్ను రేట్లను క్రమబద్ధం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబర్ 22 నుంచి రెండు స్లాబ్లు మాత్రమే ఉంటాయి. అవి 5%, 18%. అలాగే, పాన్ మసాలా, గుట్కా, పొగాకు, విలాస వస్తువుల కోసం ప్రత్యేకంగా 40% రేటును తీసుకొచ్చారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. “మేము స్లాబ్లను తగ్గించాము. ఇక రెండు స్లాబ్లు మాత్రమే ఉంటాయి. సాధారణ ప్రజలకు ఉపయోగపడే వస్తువులపై తగ్గింపులు చేశాము” అని తెలిపారు.
25
జీఎస్టీ కొత్త మార్పులతో చౌకయ్యే వస్తువులు
కొత్తగా జీఎస్టీలో చేసిన మార్పులతో కింద పేర్కొన్న వస్తువుల ధరలు తగ్గనున్నాయి.
జీఎస్టీ కొత్త రేట్లు సెప్టెంబర్ 22, 2025 (నవరాత్రి మొదటి రోజు) నుంచి అమల్లోకి వస్తాయి.
పొగాకు ఉత్పత్తులు మొదట 28% ప్లస్ సెస్ కిందనే ఉంటాయి. తరువాత అవి 40% స్లాబ్కి మారతాయి.
మొత్తంగా గృహ ఖర్చులు తగ్గుతాయి. వ్యాపారాలకు పన్ను క్రమబద్ధీకరణతో సులభతరం అవుతుంది. కానీ విలాస సరుకులు కొనేవారికి, పొగతాగే వారికి ఖర్చు మరింత పెరుగుతుంది.