కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పండుగ కానుక వచ్చేసిందే. వారికి డీఏ పెంపుపై ఉన్న సందేహాలపై క్లారిటీ వచ్చేసింది. ఏకంగా వారికి 3 శాతం పెంపు ఇస్తున్నట్టు తెలుస్తోంది. తాజా AICPI సూచీ డేటా ప్రకారం, కేంద్ర ఉద్యోగుల డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి పెరుగుతోంది. ఈ పెంపు జూలై 1, 2025 నుండి అమలులోకి వస్తుంది. అంటే ఉద్యోగులకు ఎరియర్స్ రూపంలో కూడా డబ్బులు వస్తాయి.