Gold Rate: షాకిస్తున్న బంగారం, వెండి రేట్లు, 2రోజుల్లో రూ.11,500 జంప్

Published : Mar 02, 2026, 10:25 AM IST

Gold Rate: బంగారం, వెండి రేట్లు హార్ట్ ఎటాక్ తెప్పిస్తున్నాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ పోరుతో గోల్డ్ ధరలు షాక్ ఇస్తున్నాయి. కేవలంరెండు రోజుల్లోనే 24 క్యారెట్ల బంగారంపై దాదాపు రూ. 11,500కుపై ఎగిసి రూ. 1,73,080 వద్దకు చేరింది. 

PREV
15
అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ పోరుతో గోల్డ్ ధరల్లో భారీ పెరుగుదల

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, డాలర్ మారకం విలువలో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గులు ఇవన్నీ కలిసి బంగారాన్ని మళ్లీ సురక్షిత ఆశ్రయంగా నిలబెట్టాయి. మార్కెట్లలో అస్థిరత పెరిగినప్పుడల్లా ఇన్వెస్టర్లు ముందుగా చూసేది గోల్డ్ వైపే. అదే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.

25
ఖర్చులు పెంచుతూ దేశీయ ధరలపై ఒత్తిడి

గ్లోబల్ ట్రేడింగ్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 5,320 డాలర్లను దాటింది. కేవలం ఒక్కరోజు క్రితం ఇది 5,200 డాలర్ల వద్ద ఉండగా, మరికొద్ది రోజుల కిందట 4,700 డాలర్ల స్థాయిలోనే కనిపించింది. అక్కడి నుంచి ఆగకుండా ఎగబాకుతూ ప్రస్తుతం రికార్డు స్థాయికి చేరుకుంది. వెండి కూడా అదే దిశగా కదులుతోంది. సిల్వర్ ధర 92.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే సుమారు రూ.91 వద్ద ఉండటం దిగుమతి ఖర్చులను పెంచుతూ దేశీయ ధరలపై ఒత్తిడి పెంచుతోంది.

35
24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ. 4,370

అంతర్జాతీయ మార్కెట్లో వచ్చిన పెరుగుదల భారత్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. వరుసగా రెండో రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 4,370 పెరిగి రూ. 1,73,080 వద్దకు చేరింది. అంతకుముందు రోజు కూడా రూ. 7,140 పెరగడంతో రెండు రోజుల్లోనే దాదాపు రూ. 11,500 పైగా నమోదైంది.

45
వెండిపై కిలోకు రూ. 30 వేలు పెరుగుదల

22 క్యారెట్ల గోల్డ్ కూడా గణనీయంగా ఎగబాకింది. తులానికి రూ. 4,000 పెరిగి ప్రస్తుతం రూ. 1,58,650 వద్ద ఉంది. గత సెషన్‌లో రూ. 6,550 పెరిగిన నేపథ్యంలో మొత్తం రెండు రోజుల్లోనే భారీ పెరుగుదల కనిపిస్తోంది. వెండి ధరలు అయితే మరింత వేగంగా పరుగులు పెడుతున్నాయి. కిలోకు మరో రూ. 5,000 జోడై ప్రస్తుతం రూ. 3.25 లక్షల మార్క్‌ను తాకింది. ముందటి రోజు రూ. 25,000 పెరగడంతో రెండు రోజుల్లోనే రూ. 30,000 వరకూ ఎగబాకింది.

55
కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి

ఈ ధరల పెరుగుదల పెళ్లిళ్లు లేదా శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే కుటుంబాలకు ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది. అయితే దీర్ఘకాల పెట్టుబడిదారులు మాత్రం దీన్ని భవిష్యత్ లాభాల అవకాశంగా చూస్తున్నారు. గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు, కరెన్సీ మార్పిడి విలువలు, జియోపాలిటికల్ పరిణామాలు ఎలా మారుతాయన్నదే రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల దిశను నిర్ణయించనుంది.

Read more Photos on
click me!

Recommended Stories