Gold Rate Hike: హైదరాబాద్‌లో పసిడి రేట్ల జోరు.. మళ్లీ షాక్ ఇచ్చిన గోల్డ్

Published : May 25, 2026, 11:22 AM IST

Gold Rate Hike: యుద్ధ భయం తగ్గినా బంగారం ధరలు మాత్రం తగ్గడం లేదు. మళ్లీ పరుగులు పెడుతోంది. క్రూడాయిల్ కుప్పకూలి డాలర్ బలహీనపడుతోంది..ఇదే సమయంలో హైదరాబాద్‌లో పసిడి రేట్లు పుంజుకున్నాయి. 

PREV
13
మళ్లీ తెరుచుకోనున్న హార్ముజ్ జలసంధి

పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు క్రమంగా శాంతిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య కీలక చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లలో కొత్త ఆశలు నింపుతోంది. హార్ముజ్ జలసంధి మళ్లీ పూర్తిస్థాయిలో తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రపంచ వాణిజ్యానికి ఊరటనిస్తోంది. ఇక రెండు దేశాలు వచ్చే 60 రోజుల పాటు అణు కార్యక్రమం నుంచి ఆర్థిక ఆంక్షల వరకు పలు అంశాలపై సమగ్ర చర్చలు జరపనున్నట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గించేందుకు కూడా ఇరాన్ సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది.

23
దేశీయ మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు

అయితే ఇదే సమయంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమెరికన్ డాలర్ బలహీనపడడంతో బంగారం ధరలు మళ్లీ ఎగబాకాయి. డాలర్ విలువ తగ్గితే పెట్టుబడిదారులు బంగారంవైపు మొగ్గు చూపుతారు. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కనిపిస్తోంది. దేశీయ మార్కెట్లో కూడా బంగారం రేట్లు పెరిగాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.1,46,100 వద్ద కొనసాగుతోంది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.320 పెరిగి తులానికి రూ.1,59,380కు చేరింది.

33
బలహీనపడుతున్న రూపాయి

వెండి ధర మాత్రం ప్రస్తుతం స్థిరంగానే కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2.95 లక్షల వద్ద నిలిచింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.95.34 స్థాయికి పడిపోయింది. రూపాయి బలహీనపడటం కూడా దేశీయంగా బంగారం ధరలు పెరగడానికి మరో కారణంగా మారింది. 

Read more Photos on
click me!

Recommended Stories