Today Gold Rate: బంగారం, వెండి రేట్లు మరోసారి మధ్యతరగతి ప్రజలకు ఝలక్ ఇచ్చాయి. తగ్గినట్లే తగ్గి ఇప్పుడు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ధరలు చూసి కొనుగోలుదారులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
బంగారం రేట్లు చూసి ఇక ప్రజల ఆచారాలు, సంప్రదాయాలు మార్చుకోవాలేమో. అలానే ఉంది పరిస్థితి. పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటేనే బంగారం, వెండికి ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటిది ఇప్పుడు గోల్డ్, సిల్వర్ అందని ద్రాక్షలా మారుతోంది. కనీసం అణో, బేడెత్తో కొనేవాళ్లు కూడా ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. బంగారం షాపులకు వెళ్లడానికి కూడా ఇష్టపడటం లేదు.
25
భయపడుతున్న మధ్యతరగతి ప్రజలు
మామూలుగా తులం బంగారం రూ.లక్షా 50వేలు దాటింది. ఒక వస్తువు కొనేటప్పుడు గానీ చేయించేటప్పుడు గానీ దానికి GST, మేకింగ్ ఛార్జెస్ అని బోలెడు లెక్కలు చెబుతారు. తీరా చివరకు బిల్ చూస్తే తులం ఆభరణం రూ.2లక్షలకు వచ్చేస్తుంది. ఈ ధరలు చూసి సామాన్య, మధ్యతరగతి ప్రజలు...వాటి ఉనికే మర్చిపోయే పరిస్థితి దాపురించింది.
35
ఎక్కడ ఏం జరిగినా బంగారంపైనే ఎఫెక్ట్,
ఎక్కడ ఏం జరిగినా బంగారంపైనే ఎఫెక్ట్, ఇప్పుడు వెండిపైనే ధరలు ప్రభావం భారీగానే పడింది. అటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు, మరోవైపు బంగారంపై ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం, ఇవన్నీ కలిసి గోల్డ్ ధరలు ఎగబాకేలా చేస్తున్నాయి. మొన్నటివరకు ధరలు తగ్గి కాస్త ఊరట కల్పించాయి. కానీ ఇప్పుడూ మళ్లీ పాత పాటే. ధరలు పెరిగి మురిపిస్తున్నాయి. దీంతో కొనేవాళ్లు కూడా ముఖం చాటేస్తున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్. బంగారం లేకుంటే కుదురుతుందా ? ఇలాంటి సమయంలో ధరలు పెరిగి బాంబ్ పేల్చాయి.
మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారంపై రూ.700 పెరిగి రూ.1,62,380 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల పుత్తడిపై రూ.650 పెరగడంతో 10 గ్రాములు రూ.1,48,850 వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారెట్ల పసిడి చూసుకుంటే 10 గ్రాములపై రూ.530 పెరిగి రూ.1,21,790 వద్ద నడుస్తోంది. మరో విషయం తెలిస్తే షాక్ అవుతారు.
55
కుంపటై కూర్చున్న వెండి
కొన్ని రోజులుగా వెండి స్థిరంగా ఉన్నా....ఇప్పుడు కుంపటై కూర్చొంది. వెండి కిలోపై రూ.10 వేలు పెరిగింది. సిల్వర్ ధరలు కూడా కంటిమీద కనుకులేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం కేజీ వెండి రూ.3లక్షలకు చేరుకుంది.
బంగారం, వెండి ధరలు మార్కెట్కు అనుగుణంగా మారుతూ ఉంటాయి. కాబట్టి కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు..మార్కెట్ను గమనించి కొనుగోలుచేయడం మంచిది.