Gold Price Crash: 10 రోజుల తర్వాత దిగొచ్చిన బంగారం.. ఎంత తగ్గిందంటే?

Published : Aug 19, 2026, 11:45 AM IST

Gold Price Crash: కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు ఎట్టకేలకు ఊరట దొరికింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు పసిడి ధరలను పైకి ఎగబాకుతున్నాయి. ఇవాళ దేశీయ మార్కెట్లో ధరలు తగ్గాయి. శ్రావణమాసంలో బంగారం కొనాలనుకునేవారికి రిలీఫ్ దొరికినట్లైంది.

PREV
14
పసిడి ధరలకు బ్రేక్

గత కొన్ని రోజులుగా ఆగకుండా పరుగులు తీసిన పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. 
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.920 తగ్గి రూ.1,54,970కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.850 తగ్గడంతో రూ.1,42,050 వద్ద నమోదైంది. విజయవాడలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,54,970, 22 క్యారెట్ల పసిడి రూ.1,42,050, 18 క్యారెట్ల బంగారం రూ.1,16,920గా నమోదైంది. అయితే బంగారం ధరలు తగ్గాయన్న కారణంతో వెంటనే కొనుగోలు నిర్ణయం తీసుకోవడం కంటే.. మీ నగరంలోని రిటైల్ మార్కెట్ ధరలు, నగలపై మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అంశాలను కూడా పరిశీలించడం మంచిది.

24
ఇరాన్-అమెరికా విభేదాలతో మార్కెట్లలో ఆందోళన

ఇక పసిడి ధరలపై అంతర్జాతీయ పరిణామాల ప్రభావం మాత్రం కొనసాగుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న విభేదాలు మార్కెట్లలో ఆందోళన పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు సాధారణంగా రిస్క్ ఉన్న ఆస్తుల కంటే బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతారు. అందుకే పసిడి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.

34
హర్మూజ్‌పై ఆంక్షలు

మరోవైపు హర్మూజ్ జలసంధి అంశం కూడా మార్కెట్లను కలవరపెడుతోంది. ఇరాన్‌తో చర్చలకు ప్రస్తుతం ఆసక్తి లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. హర్మూజ్‌లో పరిమిత స్థాయిలో నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయని, జలసంధి పూర్తిగా మూసుకుపోలేదని ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికా వాదనలను ఖండిస్తోంది. తమ డిమాండ్లు నెరవేరే వరకు హర్మూజ్‌పై ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఒమన్ విషయంలోనూ అమెరికా వైఖరి తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇరాన్‌తో సంప్రదింపుల్లో ఒమన్ వ్యవహరిస్తున్న తీరుపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.

44
చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి

మరోవైపు సౌదీ అరేబియాలోని చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి చేసినట్లు ఇరాన్ సపోర్ట్ ఉన్న హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఈ పరిణామాలతో ముడిచమురు మార్కెట్లలోనూ ఆందోళన కొనసాగుతోంది. అంటే.. ఒక్కవైపు యుద్ధ వాతావరణం, మరోవైపు హర్మూజ్ ఉద్రిక్తతలు, ఇంకోవైపు చమురు మార్కెట్‌లో అనిశ్చితి.. ఇవన్నీ కలిసి బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే ఈరోజు ధరలు తగ్గినా.. రానున్న రోజుల్లో పసిడి ధరలు మళ్లీ ఏ దిశలో కదులుతాయన్నది అంతర్జాతీయ పరిణామాలపైనే ఆధారపడి ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories