'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిసలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్, 1952' లోని సెక్షన్ 14B, 'కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, 2020' లోని సెక్షన్ 128 కింద నమోదైన కేసులకు ఈ పథకం వర్తిస్తుంది. ముఖ్యంగా నాలుగు రకాల కేసులలో ఈ వెసులుబాటు ఉంటుంది..
• కోర్టు కేసులు: జరిమానా లేదా పరిహారం ఆదేశాలను సవాలు చేస్తూ కోర్టులు లేదా ఇతర న్యాయ స్థలాల్లో పెండింగ్లో ఉన్న కేసులు.
• పెండింగ్ రికవరీ కేసులు: చివరి నోటీసులు జారీ అయి, ఇంకా సొమ్ము పూర్తిగా వసూలు కాకుండా రికవరీ సర్టిఫికేట్ జారీ అయిన కేసులు.
• నోటీసులు ఇచ్చిన కేసులు: ఈపీఎఫ్ఓ నుంచి నోటీసులు అంది, ఇంకా చివరి జరిమానా ఆదేశాలు రాక పెండింగ్లో ఉన్న కేసులు.
• ప్రారంభ దశలోని కేసులు: జరిమానాల సంబంధించి ఇంకా నోటీసులు కూడా జారీ కాకుండా ప్రాథమిక దశలో ఉన్న వ్యవహారాలు.