EPFO: ప్రతి నెల పీఎఫ్ కట్ అవుతున్న వారికి కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఈపీఎఫ్ఓ ప్రస్తుతం ఇస్తున్న కనీస పెన్షన్ను రూ.1000 నుంచి రూ.3000కు పెంచే అంశంపై కీలక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం EPS-95 స్కీమ్ కింద ఉద్యోగులకు కనీసంగా నెలకు రూ.1000 పెన్షన్ అందుతోంది. అయితే పెరుగుతున్న ధరలు, జీవన వ్యయం కారణంగా ఈ మొత్తం సరిపోవడం లేదని చాలా కాలంగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా చిన్న ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వారు ప్రస్తుతం వచ్చే పెన్షన్తో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ను రూ.3000కు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే తక్కువ జీతాలతో పనిచేసిన ఉద్యోగులకు పెద్ద ఉపశమనం లభించే అవకాశం ఉంది.
25
EPF పెన్షన్ లెక్కింపు ఎలా జరుగుతుంది?
EPF పెన్షన్ ఉద్యోగి పనిచేసిన సంవత్సరాలు, సగటు జీతం ఆధారంగా లెక్కిస్తారు. ఉద్యోగి చివరి 60 నెలల సగటు జీతాన్ని పరిగణలోకి తీసుకుని పెన్షన్ను నిర్ణయిస్తారు. ఎక్కువ కాలం ఉద్యోగం చేసిన వారికి ఎక్కువ ప్రయోజనం లభించే అవకాశం ఉంటుంది. 20 సంవత్సరాలకు పైగా సేవలు అందించిన ఉద్యోగులకు అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అయితే ప్రస్తుతం రూ.3000 కనీస పెన్షన్పై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కార్మిక శాఖ, EPFO అధికారులు ఈ అంశంపై చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
35
EPFO 3.0తో పూర్తిగా డిజిటల్ సేవలు
ప్రభుత్వం EPFO వ్యవస్థను మరింత స్మార్ట్గా మార్చేందుకు “EPFO 3.0”ను తీసుకురాబోతోంది. ఇప్పటివరకు PF క్లెయిమ్ లేదా ఇతర సేవల కోసం ఉద్యోగులు ఎక్కువ సమయం వేచి చూడాల్సి వచ్చేది. కొత్త వ్యవస్థలో ఈ ప్రక్రియలను వేగంగా, సులభంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. క్లెయిమ్ సెటిల్మెంట్ ఆటోమేటిక్గా జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. దీని వల్ల PF డబ్బుల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం తగ్గుతుంది. అలాగే ఉద్యోగులు తమ KYC, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను ఆన్లైన్లోనే సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మొబైల్ యాప్, పోర్టల్ ద్వారా పెన్షన్ స్టేటస్ కూడా వెంటనే తెలుసుకోవచ్చు.
EPFO 3.0లో భాగంగా సభ్యులకు ATM లేదా డెబిట్ కార్డ్ తరహా సౌకర్యాన్ని అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ విధానం అమల్లోకి వస్తే ఉద్యోగులు తమ PF డబ్బులను ATM ద్వారా నేరుగా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు PF డబ్బుల కోసం క్లెయిమ్ పెట్టి ఆమోదం వచ్చే వరకు వేచి చూడాల్సి వచ్చేది. కానీ కొత్త విధానంతో అత్యవసర సమయంలో కూడా వెంటనే డబ్బులు తీసుకునే వీలు ఉంటుంది.
55
AI టెక్నాలజీతో వేగవంతమైన సేవలు
కొత్త EPFO 3.0లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని కూడా ఉపయోగించనున్నారు. దీని ద్వారా ఫేక్ క్లెయిమ్స్ను గుర్తించడం సులభమవుతుంది. మోసాలను తగ్గించడంతో పాటు మొత్తం ప్రక్రియను వేగంగా పూర్తి చేయవచ్చు. ఉద్యోగులు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే విధానం మరింత సులభం కానుంది. మొత్తానికి EPFOలో తీసుకురాబోతున్న ఈ మార్పులు ఉద్యోగులకు పెద్ద ఊరటనివ్వనున్నాయి. ముఖ్యంగా కనీస పెన్షన్ పెంపు అమల్లోకి వస్తే లక్షలాది మంది పెన్షనర్లకు ఆర్థికంగా మంచి సహాయం లభించే అవకాశం ఉంది.