వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపు
విత్తనాలు, ఎరువులు వంటి వ్యవసాయ ఇన్పుట్లపై జీఎస్టీని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం విత్తనాలు, ఎరువులపై వేర్వేరుగా ఎక్కువ జీఎస్టీ ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని తగ్గించడం ద్వారా రైతుల లాభాలను పెంచవచ్చు. ఈ మేరకు బడ్జెట్లో ప్రకటన వెలువడనుంది.