Kashi Varanasi: కాశీలో అలాంటి వ్యక్తుల శవాలను దహనం చేయరు? ఎందుకంటే..?

Kashi Varanasi: కాశీలో మరణించిన వారికి మోక్షం లభిస్తుందని అంటారు. అందుకే పూర్వం పెద్దవాళ్లు కాశీ వెళుతున్నామని ఇంటి నుంచి వెళ్లే వారు. ఇక వారు తిరిగి వచ్చే వారు కాదు. కాశీలోనే చివరి రోజులు గడిపి అక్కడే మరణించేవారు. అలా కాశీలో మరణించిన వారిలో కొంతమంది శవాలను దహనం చేయరు. ఎవరి శవాలను దహనం చేయరు? ఎందుకు చేయరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

Bodies Not Cremated in Kashi Varanasi Reasons Explained in telugu sns

కాశీలో మరణించిన గర్భిణీ స్త్రీలను అక్కడ దహనం చేయరు. దీని వెనుక ఓ ప్రత్యేక కారణం ఉంది. గర్భిణీ స్త్రీల శరీరాన్ని కాల్చితే కడుపు ఉబ్బిపోయి చితిలో పేలిపోయే అవకాశం ఉంటుంది. అది వాతావరణానికి, చుట్టుపక్కల పరిశరాలకు మంచిది కాదు. కాబట్టి గర్భిణీ స్త్రీల శవాలను కాశీలో కాల్చరు.

కాశీలో సాధువుల శవాలను కాల్చరు. వారి శరీరాన్ని నీటిలో వదులుతారు లేదా పాతిపెడతారు. ఎందుకంటే సాధువుల శవాలు కూడా ఇతర జీవులకు ఆహారంగా ఉపయోగపడాలని వారు ఇలా చేస్తారు.

కాశీలో చిన్న పిల్లల శవాలను కూడా కాల్చరు. ఒక పిల్లవాడు పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంటే, ఆ శవాన్ని దహనం చేయరు. పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను దేవుడి స్వరూపంగా భావిస్తారు. ఈ కారణంగా ఆ శవాలను కాల్చడం కాశీలో నిషేధం.


పాము కాటుతో చనిపోయిన వారి శవాలను కూడా కాశీలో దహనం చేయరు. పాము కాటుతో చనిపోయిన వారి మెదడు 21 రోజుల వరకు సజీవంగా ఉంటుందని చెబుతారు. అలాంటి పరిస్థితుల్లో వారి మృతదేహాన్ని అరటి దుంగలో కట్టి నీటిలో తేలియాడేలా చేస్తారు. ఈ శరీరం తాంత్రికుల కంట పడితే, వారు ఈ శరీరాలను మళ్లీ బతికిస్తారని కాశీలో నమ్ముతారు.

కాశీలో చర్మ వ్యాధి లేదా కుష్టు వ్యాధితో బాధపడుతున్న రోగి చనిపోతే వారి శరీరాన్ని దహనం చేయరు. వారి శవాలను దహనం చేస్తే వ్యాధి బ్యాక్టీరియా గాలిలో వ్యాప్తి చెంది ఇతరులు కూడా ఈ వ్యాధికి గురవుతారు. ఈ కారణంగా కాశీలో వారి మృతదేహాలను కాల్చడం నిషేధం. 

అమ్మవారి వ్యాధి సోకి చనిపోయిన వారి శవాలను కూడా కాశీలో దహనం చేయరు. ఆ శరీరాలను అమ్మవారే తీసుకుంటుందని భక్తులు నమ్ముతారు. అందుకే వాటిని కాల్చకుండా వదిలేస్తారు.

ఇది కూడా చదవండి ఏడు రోజులకు ఏడు మంత్రాలు.. ఇవి జపించి పనులు చేస్తే విజయం మీసొంతం

Latest Videos

vuukle one pixel image
click me!