మీరు పీఎం కిసాన్ స్కీమ్లో ఉంటే లాభమేంటి?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో చేరిన రైతులు ఈ పెన్షన్ స్కీమ్ లో చేరడానికి ఎలాంటి అదనపు డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. అన్ని డాక్యుమెంట్లు ఇదివరకే సబ్మిట్ చేసి ఉంటారు కనుక ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. పెన్షన్ స్కీమ్లో రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సభ్యత్వ రుసుము కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ఆటోమేటిక్గా కట్ అవుతుంది.
ఉదాహరణకు ఒక రైతు 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే నెలకు రూ.55 చెల్లిస్తే చాలు. అదే రైతు 40 ఏళ్ల వయసులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే నెలకు రూ.200 కట్టాలి. ఈ మొత్తం ఏడాదికి రూ.660 నుంచి రూ.2400 మధ్య ఉంటుంది.