Medicine Prices: సెప్టెంబర్ 22 నుండి ఈ మందులన్నీ చాలా చవక, అన్ని రేట్లు తగ్గబోతున్నాయి

Published : Sep 13, 2025, 01:33 PM IST

కొత్త జీఎస్టీ వ్యవస్థ అమలు చేశాక అనేక మందుల (Medicine) ధరలు తగ్గబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని వ్యాధులకు సంబంధించిన మందులు ధరలు అధికంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల రోగులు పై ఇది ప్రత్యక్ష ప్రయోజనాన్ని చూపిస్తుంది. 

PREV
15
మందుల ధరలపై తగ్గింపు

ఆధునిక కాలంలో రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక మందులు వాడేవారు ఉన్నారు. కొత్త జీఎస్టీ వ్యవస్థ ప్రకారం మందుల ధరలు తగ్గబోతున్నాయి. దీనివల్ల ఎంతో మంది పేదలు, మధ్యతరగతి వారు ప్రత్యక్ష ప్రయోజనాలను పొందబోతున్నారు. ఏ మందుల ధరలు తగ్గబోతున్నాయో తెలుసుకోండి.

25
అందరికీ ఆదేశాలు

రసాయనాలు ఎరువులు మంత్రిత్వ శాఖ ఇప్పటికే అన్ని ఫార్మా కంపెనీలకు కొత్త ధరలను నిర్ణయించి మార్కెట్లోకి విడుదల చేయాలని ఆదేశించింది. డీలర్లు, రీటైలర్లు, రాష్ట్ర ఔషధ నియంత్రణదారులు...ఇలా అందరికీ ఆదేశాలు జారీ చేసింది. పన్ను తగ్గింపు ప్రక్రియ అమల్లోకి రావాలని, సెప్టెంబర్ 22 నుంచి మందుల ధరలు తగ్గాలని ఆర్డర్ వేసింది.

35
సెప్టెంబరు 22 నుంచి..

సెప్టెంబర్ 22 కు ముందే మార్కెట్లో విడుదల చేసిన మందులను రీకాల్ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పింది. వాటికి మాత్రం మినహాయింపును ఇచ్చింది. ఇక సెప్టెంబర్ 22 నుండి మార్కెట్లోకి వచ్చే అన్ని మందుల ధరలు చాలావరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. వాటికి కొత్త జీఎస్టీ పన్నుని అమలు చేయాలని కేంద్రం స్పష్టంగా చెప్పింది.

45
వీటి ధరలు తగ్గుతాయి

కొత్త జీఎస్టీ వ్యవస్థ వల్ల ముఖ్యంగా క్యాన్సర్, ఆస్తమా వంటి వ్యాధులకు సంబంధించిన మందుల ధరలు చాలా వరకు తగ్గుతాయి. వీటిపై జిఎస్టి 12 శాతం ఉండేది. దాన్ని ఐదు శాతానికి తగ్గించారు. అలాగే గాయాలు తగిలినప్పుడు వాడే డ్రెస్సింగ్ మెటీరియల్ పై పన్నును కూడా 12 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు. టాల్కం పౌడర్, హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్, షేవింగ్ క్రీమ్, సబ్బులు ఇలా అన్నిటిపైన జీఎస్టీ పన్నులను 18 శాతం నుండి ఐదు శాతానికి తగ్గించారు. కాబట్టి వీటి ధరలు త్వరగా తగ్గుతాయి.

55
ఎంత తగ్గుతుంది?

గతంలో వెయ్యి రూపాయల విలువైన మందులు కొంటే జిఎస్టి పన్ను 120 రూపాయల వరకు పడేది. అయితే ఇప్పుడు కొత్త జీఎస్టీ పన్నుల వల్ల 50 రూపాయలు మాత్రమే పడుతుంది. అంటే 70 రూపాయలు మిగులుతుంది. తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఇది పెద్ద లాభమేనని చెప్పుకోవాలి. ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్లకు అధికంగా ఖరీదైన మందులు వాడాల్సి వస్తుంది. వాటన్నిటి పైన జిఎస్టి పన్ను తగ్గుతుంది. కాబట్టి వారికి వందల్లో లేదా వేలల్లో మిగిలిన అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories