ఉద్యోగుల‌కు పండ‌గ‌లాంటి వార్త‌.. భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు. ఏకంగా మూడు రెట్లు..

Published : Oct 28, 2025, 04:33 PM IST

8th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 8వ వేతన కమిషన్‌కు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, భత్యాలు పెరగనున్నాయి. ఈ పెంపు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 

PREV
15
8వ వేతన కమిషన్ ఆమోదం

కేంద్ర మంత్రివర్గం 8వ వేతన కమిషన్ (8th Pay Commission) **Terms of Reference (ToR)**‌ను బుధవారం ఆమోదించింది. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త వేతన సవరణకు మార్గం సుగమం అవుతుంది. ఈ సవరణతో దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల ఉద్యోగులు, 69 లక్షల పెన్షనర్లు లాభపడతారని అంచనా.

25
కమిషన్‌ కమిటీ వివరాలు

8వ వేతన కమిషన్‌ను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన ప్రకాశ్ దేసాయ్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. కమిషన్‌కి తన తుది నివేదిక సమర్పించేందుకు 18 నెలల గడువు ఉంటుంది. అంతకుముందు ఒక ఇంటర్నల్ నివేదిక (Interim Report) కూడా సమర్పించనుంది. సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపిన ప్రకారం, ఇంటర్నల్ నివేదిక ఇచ్చిన తర్వాతే అమలు తేదీని ఖరారు చేస్తారు. అయితే ఇది 2026 జనవరి 1నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు.

35
ఎంత జీతం పెరుగుతుండొచ్చు..

ఇప్పటివరకు అధికారిక పే స్లాబ్స్ విడుదల కాలేదు. కానీ అంచనాల ప్రకారం జీతం రూ. 19,000 వరకు పెరగొచ్చు. దీని ఆధారంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ (Fitment Factor) 2.86గా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఉదాహరణకు, ప్రస్తుతం రూ. 1,00,000 జీతం పొందుతున్న ఉద్యోగి జీతం ఇలా పెరగవచ్చు.

ప్రభుత్వం రూ. 1.75 లక్షల కోట్లు కేటాయిస్తే → జీతం రూ. 1.14 లక్షలు (14% పెరుగుదల)

రూ. 2 లక్షల కోట్లు కేటాయిస్తే → రూ. 1.16 లక్షలు (16% పెరుగుదల)

రూ. 2.25 లక్షల కోట్లు కేటాయిస్తే → రూ. 1.18 లక్షలు (18% కంటే ఎక్కువ పెరుగుదల)

45
ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కీలకం

జీతాలు ఎంతవరకు పెరుగుతాయో నిర్ణయించేది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌. గతంలో 7వ వేతన కమిషన్ (2016)లో ఈ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయించారు. దాంతో కనిష్ఠ ప్రాథమిక వేతనం రూ. 7,000 నుంచి రూ. 18,000కి పెరిగింది.

8వ వేతన కమిషన్‌లో అదే 2.57 ఫ్యాక్టర్‌ను అమలు చేస్తే, కనిష్ఠ వేతనం రూ. 18,000 నుంచి రూ. 46,260కి పెరుగుతుంది. అలాగే కనిష్ఠ పెన్షన్ రూ. 9,000 నుంచి రూ. 23,130 అవుతుంది.

అయితే మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ అభిప్రాయం ప్రకారం, కొత్త ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92 వరకు మాత్రమే ఉండవచ్చని చెప్పారు. ఆ స్థాయిలో ఉన్నా, వేతనం 92% పెరుగుదలతో రూ. 34,560గా మారుతుంది.

55
ఎప్పుడు అమలవుతుంది?

ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. కొత్త వేతన సంఘం జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రావాలి. కమిషన్ నిర్ణయాలు జూలై 2027 నాటికి ప్రకటిస్తే.. ఉద్యోగులు జనవరి 2026 నుంచి జూలై 2027 వరకు బకాయిలను పొందే అవకాశం ఉంటుంది. 18 నెలల బకాయిలను పొందడం వల్ల లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు భారీగా ప్రయోజనం పొందుతారు.

Read more Photos on
click me!

Recommended Stories