జీతాలు ఎంతవరకు పెరుగుతాయో నిర్ణయించేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్. గతంలో 7వ వేతన కమిషన్ (2016)లో ఈ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయించారు. దాంతో కనిష్ఠ ప్రాథమిక వేతనం రూ. 7,000 నుంచి రూ. 18,000కి పెరిగింది.
8వ వేతన కమిషన్లో అదే 2.57 ఫ్యాక్టర్ను అమలు చేస్తే, కనిష్ఠ వేతనం రూ. 18,000 నుంచి రూ. 46,260కి పెరుగుతుంది. అలాగే కనిష్ఠ పెన్షన్ రూ. 9,000 నుంచి రూ. 23,130 అవుతుంది.
అయితే మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ అభిప్రాయం ప్రకారం, కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.92 వరకు మాత్రమే ఉండవచ్చని చెప్పారు. ఆ స్థాయిలో ఉన్నా, వేతనం 92% పెరుగుదలతో రూ. 34,560గా మారుతుంది.